పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దుగ్యాలను ఇటీవలే కుటుంబసభ్యులు హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుగ్యాల శ్రీనివాసరావు ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దుగ్యాల మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కాగా రేపు హన్మకొండలో దుగ్యాల అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
అయితే వర్ధన్నపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామానికి చెందిన దుగ్యాల 2004 ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం దుగ్యాల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2009,2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతిలో స్వల్ఫ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే 2015 నుంచి దుగ్యాల క్రియాశీల రాజకీయాలకు మెల్లగా దూరమయ్యారు.