తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఇటీవలే కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో కేసుల సంఖ్య మరింత తగ్గుతూ వస్తుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 151 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు ఎవరూ చనిపోలేదు. ఇక కరోనా నుంచి నేడు మరో 185 మంది కోలుకున్నారు.
అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,428 కి చేరింది. ఇక ఇప్పటివరకు 2,93,033 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 1,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,614 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 27,259 మంది శాంపిల్స్ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 82,69,364 టెస్ట్లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 98.85 శాతం ఉండగా, మరణాల రేటు 0.54% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.