తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ కనిపిస్తున్నా, కరోనా కొత్త వైరస్ మళ్ళీ అందరిని కలవరపెడుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 298 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో ఇద్దరు చనిపోయారు. ఇక కరోనా నుంచి నేడు మరో 474 మంది కోలుకున్నారు.
అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,433 కి చేరింది. ఇక ఇప్పటివరకు 2,83,048 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 4,822 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,563 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 31,187 మంది శాంపిల్స్ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 72,15,785 టెస్ట్లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 97.79 శాతం ఉండగా, మరణాల రేటు 0.54% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.